మళ్లీ ఆ సంస్థకు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్

by Disha Web Desk 15 |
మళ్లీ ఆ సంస్థకు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్
X

దిశ, వెబ్​డెస్క్​ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో ప్రచారం చేసిన ఓ వ్యాపార సంస్థకు మళ్లీ ప్రచార కర్తగా నియమితులయ్యారు. ఓ వైపు సినిమా షూటింగులతో అత్యంత బిజీగా ఉంటున్నా మరోవైపు వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. ఆయన ఇప్పటికే పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించారు. ఈయన నటించిన ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్​ అవార్డు గెలుపొందడంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. దాంతో మంచి జోష్ లో​ ఉన్నారు. దీంతో పాటు అప్పుడప్పుడూ టీవీ రియాల్టీ షోలలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలో మరో కంపెనీకి ప్రచారకర్తగా నియమితులయ్యారు. ప్రముఖ బంగారు, వజ్ర ఆభరణాల కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెలరీ కంపెనీకి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

దీనికి సంబంధించి ఓ యాడ్‌ ఇటీవల టీవీల్లో ప్రచారం అవుతుంది. గతంలోనూ ఎన్టీఆర్ ఓ సారి మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఈ తెలుగు హీరో భారీ పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం కేఎఫ్‌సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ నియమితులైన విషయం తెల్సిందే. ఈయన మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేశారు. ఇదిలావుంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నారు. ఇదికాకుండా బాలీవుడ్ చిత్రం వార్-2 లో నటించనున్నారు. టీవీలో కొత్త ప్రకటన వస్తుండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More: ప్రాజెక్ట్-K సినిమా నుంచి స్టోరి లైన్ లీక్.. కథ ఏంటంటే..?

Next Story

Most Viewed